కూడలి
మాలిక
హారం
కొండ ఫలం
దళారి ఫలహారం….
వారి స్వచ్చతను
నిలువెల్లా గాయపరుస్తూ
సాగే వ్యాపారం…
ఇది ఏళ్ళుగా సాగుతున్న
శ్రమ దోపిడీవలయం…
గత ఆరునెలలుగా చూస్తున్నా…ఆంద్రజ్యోతి పేపర్లో ప్రతిరోజూ ప్రధాన వార్తగా ముందుపేజీలో లేకపోతే ఎక్కడో ఓ చోట ఆమె ఫోటోతో కూడిన వార్త రాయకుండా లేరు. ఆమె ఒక్కతే ఈ కుంభకోణమంతటికీ కారణంలా ఆమెనే ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంటే ఈ సందేహమొచ్చింది.
రాజకీయ నాయకుల వత్తిడులకు లోను కాని అధికారులెవరైనా వున్నారా? పోనీ వత్తిడి చేయని రాజకీయనాయకులున్నారా?? తెలుగుదేశం పాలనా కాలంలో జరిగిన ఏలేరు కుంభకోణంలో పాల్గొన్న అధికారులు లేరా?? ఎన్నో అవకతవకలను కప్పిపుచ్చేస్తూ అధికారులు రాజకీయ నాయకులతో అంటకాగడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఒక్క శ్రీలక్ష్మితోనే మొదలు కాలేదు..తుదీ కాలేదు. మరి ఆంధ్రజ్యోతికి ఎందుకీ కక్ష ఆమెపై.. దేవాలయానికి వెళ్ళినా వెంటపడి అక్కడా వ్యంగ్యంగా రాతలు. జైల్లో భర్త కలిసినా వార్త. ఆమె తోటి ఖైదీలతో మాటాడినా వార్త. అసలు ఈ పత్రిక వార్తలు మరచి కథనాలు రాస్తూంది అన్నది నిజం కాదా??
ఒక మహిళ పట్ల ఈ రకమైన ప్రవర్తన కలిగి వుండటం ఏ జర్నలిజం. ఆమె తప్పు చేసినట్టు నిరూపితమైతే శిక్ష అనుభవిస్తుంది. ప్రస్తుతం జైల్లోనే రిమాండ్ లో వున్నారు కదా?? ఇంక మీ కథనాలతో ఆమె వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం సమంజసమా??
ఈ రోజు వార్త దినపత్రికలో ఈ వార్త చదివి ఆశ్చర్యమేసింది..
నాలుగువందల రూయల జేబు దొంగతనం చేసిన వ్యక్తికి ఓ ఏడాది జైలు శిక్ వంద రూపా జరిమానాను వేసారు విశాఖపట్టణంలో గౌరవనీయ స్థానిక మేజిస్ట్రేటు వారు.
మరి ఇన్ని లక్షల కోట్ల కుంభకోణాలు చేసిన వారికి ఎన్నేళ్ళు శిక్ష ఎంత జరిమానా వేయాలి. ఏమిటో కడుపు జరక్కో, చిల్లర పనులకో ఆశ పడి జేబు కత్తిరిస్తే పాపం ఓ ఏడాది జైలు.
ఈ ఘరానా దొంగలకు నిజంగా శిక్షపడుతుందా?? అరెస్టైనా జైలులోనూ ప్రత్యేక సౌకర్యాలు, అనారోగ్యం పేరుతో ఆసుపత్రులలో వైద్యాలు.. ఇదీ మన నేర శిక్షాస్మృతి…
ఉన్నోడికి మేసినంత.. లేనోడికి కడుపుమంట…
లక్షకొలువులు ఇచ్చేశాం అని సిఎం గారి ప్రకటన చూస్తే నవ్వొస్తోంది. ఈమధ్య ఈ యువకిరణాల ఉద్యోగాలపై గ్రామాలలోని యువకులు తామిచ్చిన కొలువులలో చేరారా లేదా అని విచారణకు గ్రామస్థాయి కమిటీలు వేసారు. నేనూ తిరిగా.. కానీ అందులో పేర్కొన్న కంపెనీలలో ఒక్కడు చేరలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారమే లేదు. అసలు ఆ జాబితాలో ఇచ్చిన పేర్లలో 5 శాతానికి మించి ఎవరూ ఆ ఊళ్ళలో లేరు. ఏ ఊరివారో తెలీలేదు. అది స్వయంగా జిల్లా ఎంప్లాయ్ మెంటు ఎక్స్చేంజీ వారిచ్చిన జాబితా. సెక్యూరిటీ గార్డు పోస్టులలో స్వంత ఖర్చులతో చేరిన వారి పేర్లుకూడా వీళ్ళు కలిపేసుకున్నారు. ఇది మా పరిశీలనలో తేలిన అంశం. ఎందుకయ్యా ఇలా జన్నాన్ని మోసగిస్తారు??
సుఖమన్నది ఎరుగని
పిచ్చి నాగలి ఆకలిగా నేలపై
మోరజాపి జూస్తుంటే
ఆ నేలపై తిరుగాడే వాళ్ళకు
ఇంక మంచి జరుగుతుందా??
ప్రతిది తూనిక జేసి గాజు గోళాల మధ్య
జరిగే సత్తు వ్యాపార కూడళ్ళలో
నువ్వు ఆబగా నాకే విదేశీ పాచి వాసన
నీ ముక్కు రంధ్రాలకు సోకడం లేదంటే
శాపగ్రస్తుడెవ్వడో బోధపడలేదా??
చిరుగు పాతలే నీ మానాన్ని
కాపాడే ఎరగా నీ కళ్ళముందు తెరలు తెరలుగా
కదలాడుతుంటే నీవమ్మేసిన అమ్మతనం
ఇంక నీకు కానరాలేదంటే ధృతరాష్ట్రుడెవడో
ఎరుకపడలేదా???
బుడబుక్కల వారిలా వేషాలేస్తూ
రోజుకో నెరవేరని హామీల నేతి బీరకాయల్ని
గుప్పిస్తూ కుప్పిగంతులేస్తున్న వాడ్ని చూసి
వాడి ముఖాన ఖాండ్రించి ఉమ్మడానికి కూడా
అసహ్యమేస్తుందన్నది నిజం
ఈశాన్య రాష్ట్రాలలో అమలు కాబడుతున్న ప్రత్యేక సైనికాధికార చట్టానికి వ్యతిరేకంగా గత పదకొండేళ్ళుగా పోరాడుతున్న ఇరోం షర్మిళకు మద్దతు తెలుపుదాం.. కృత్రిమంగా ఆహారాన్ని సరఫరా చేస్తూ నిర్బంధాన్ని అమలు చేస్తున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా మేధావులు ప్రజాస్వామిక వాదులు విరివిగా కదలి రావాలసిన అవసరముంది. అన్నా హజారే దీక్షకు మద్ధతుగా కదిలిన జనం, రాజకీయ పార్టీలు గత పదకొండేళ్ళూగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న షర్మిళ పట్ల అనాగరికంగా కిమ్మనకుండా వుండటానికి ఓటు బ్యాంకు రాజకీయాలు తో పాటు ఒకే తానులోని గుడ్డలైన రాజకీయ వర్గాలు ఈ విషయంలో మౌనం దాల్చడం నేరం.. కౄరమైన చట్టాలను ప్రయోగిస్తూ పౌరుల హక్కులను హరించి వేస్తున్న పాలక వర్గాలన్నీ ఒకటిగానే కనిపిస్తున్నాయి. దీనికి మీడియాకూడా వంత పాడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న షర్మిళ పోరాటానికి మద్ధతు తెలుపుదాం.. AFSPA ను తక్షణమే రద్దు చేయాలని గొంతు కలుపుదాం..